ఉపాధిహామీ కూలీలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. మంగళవారం నారాయణపేట మండలం చిన్నజట్రం, లక్ష్మీపూర్ గ్రామాలలో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ. ప్రాంతాల్లో కూలీలు మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని కోరారు. పని ముట్లు ప్రభుత్వం అందించాలన్నారు.