హైదరాబాద్ మధురానగర్లో ఓ మహిళ కానిస్టేబుల్ కూతురు కిడ్నాప్ కలకలం రేపుతోంది. 12 ఏళ్ల తన కూతురుని కిడ్నాప్ చేశారంటూ మధురానగర్ పోలీస్స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. బాలికకు మాయమాటలు చెప్పి ఇంటి సమీపంలో ఉంటున్న ఆంజనేయులు అనే వ్యక్తి తీసుకెళ్లాడని బాలిక తల్లి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే బాలికను ఎందుకు కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ వెనుక ఉన్న కారణలేంటి అనేది తెలియాల్సి ఉంది. అనుమానితుడు ఆంజనేయులు దొరికితే ఆసలు విషయాలు బయటపడనున్నాయి.