ఈ నెల 26న ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బకాయిలను విలీన ప్రక్రియకు ముందుగానే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ కె.రాజిరెడ్డి తెలిపారు. 2017, 2021 పీఆర్సీలతోపాటు 2013 పీఆర్సీ 50శాతం బాండ్ నిధులు తక్షణం కార్మికులకు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్టు రాజిరెడ్డి తెలిపారు. బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో 26న మహాధర్నా నిర్వహిస్తామన్నారు.