కాంగ్రెస్ విజయభేరి సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు సాధ్యం కానివని మంత్రి సత్యవతిరాథోడ్ ఆదివారం తెలియజేసారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్న బీఆర్ఎ్సనే తెలంగాణ ఓటర్లు గెలిపించారన్నారు. అసలు గ్యారెంటీలేని కాంగ్రెస్ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని.. ఆ పార్టీ సీఎం అభ్యర్థిని ఢిల్లీ నాయకులు ప్రకటిస్తే.. ఇక్కడి నేతలు సమర్థించే గ్యారంటీ లేదని విమర్శించారు. కర్ణాటకలో ఇలాంటి హామీలే ఇచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని తెలియజేసారు.