ఖైరతాబాద్ మహాగణపతికి భారీ కండువా, యజ్ఞోపవీతం, గరికమాలతో పాటు దేవతామూర్తులకు పట్టువస్త్రాలను సిద్ధం చేసినట్లు పద్మశాలి సంఘం నేతలు కడారి శ్రీధర్, గుర్రం కొండయ్య ఆదివారం తెలిపారు. వీటికి పూజలు నిర్వహించారు. ఏటా మాదిరిగానే 75 అడుగుల కండువా, జంధ్యం, గరికమాల, గణపతికి ఇరువైపులా కొలువుదీరే వీరభద్ర స్వామి, నరసింహస్వామి, సరస్వతీదేవి, వారాహి మూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నట్లు చెప్పారు.