డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ నిరంతరంగా కొనసాగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గృహలక్ష్మి పథకం కింద మూడు దశల్లో రూ.3 లక్షలు ఆర్థిక సాయం లబ్ధిదారులకు అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. 44 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని, దశాబ్ద కాలంలోనే కొత్తగా 21 మెడికల్ కళాశాలలు ప్రారంభించామని, ఐటీ రంగంలో తెలంగాణ దేశంలోనే మేటిగా ఎదిగిందన్నారు.