తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 17న ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన పాల్గొని, ప్రసంగించారు. ఐటీ రంగంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని సీఎం చెప్పారు. హైదరాబాద్ను విశ్వ నగరం తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో రూ.69 వేల కోట్లతో 415 కి.మీ మేర మెట్రో సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.