అనేక కీలక విషయాలపై నిర్ణయాలను సీడబ్ల్యూసీలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని.. అలానే ఈ సమావేశాల్లోనూ కొన్ని చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర ప్రజల జీవితాలను సమూలంగా మార్చేలా అద్భుతమైన గ్యారంటీలను విజయభేరి సభలో ప్రకటించనున్నట్లు తెలిపారు. గ్రామగ్రామానికి ఈ గ్యారంటీలను కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకువెళ్లాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని భట్టి చెప్పారు.