సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ డివిజన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. హుగ్గేల్లి గ్రామ శివారులో గల 65వ నంబర్ జాతీయ రహదారిపై ఎక్కేల్లి టౌన్ షిప్ ముందు మంగళవారం సాయంత్రం రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద సంఘటనలో కోహిర్ మండలం పీచే రాగడి గ్రామానికి చెందిన చిరంజీవి రెండు కాళ్లు విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈరోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అంబులేన్స్ సిబ్బంది ఇఎంటీ సంగమేశ్, పైలేట్ బి. శ్రీనివాస్ తీవ్రంగా గారపడిన క్షతగాత్రుడు చిరంజీవి ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వేగంగా తీసుకువెళ్లారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది క్షతగాత్రులకి ప్రథమ చికిత్స అందించి, సంగారెడ్డి పట్టణంలో గల పెద్ద ఆసుపత్రికి పంపించారు. అయితే మదిరే చౌరస్తా వైపు నుంచి హుగ్గేల్లి వైపు వస్తున్న ఓ ప్రైవేట్ కారు-రాంగ్ రూట్ లో ఏక్కేల్లి టౌన్ షిప్ వైపు వెళుతున్న ఆటోను ఎదురుగా ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.