హత్య కేసులో ఇద్దరికి జీవి ఖైదును కోర్టు విధించింది. వారికి రూ.10వేలు చొప్పన జరిమానా విధించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మెదక్ జిల్లా ఎస్పి రోహిణి ప్రియదర్శిని మంగళవారం వెల్లడించారు. సాలోజి పల్లి గ్రామంలో ఇద్దరు నిందితులకి జీవిత ఖైదు మరియు ఒక్కొక్కరికి రూ. 10, 000/- జరిమానా విధించారు. ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్. పి శ్రీమతి రోహిణి ప్రియదర్శినిఐ. పి. యెస్ గారు మాట్లాడుతూ. అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలోజీపల్లి గ్రామానికి చెందిన వేముల నాగమణి వద్ద ఆమె భర్త వేముల సాయిలు 07. 01. 2020 సాయంత్రం 05: 30 గంటల ప్రాంతంలో బీడిలు కొనుక్కునేందుకు రూ.20 తీసుకొని వెళ్లాడు.
రాత్రి వరకు ఎదురు చూసినా సాయి ఇంటికి రాలేదు. బంధువులు, స్థానికులతో వెతికినా ఎటువంటి ఆచూకీ లభించలేదు 08. 01. 2020 ఉదయం 7: 00 గంటల సమయంలో సాయిలు టేక్మాల్ గ్రామ శివారులో రోడ్డు పక్కన పెద్ద చెరువు వద్ద తలకు గాయమై చనిపోయి ఉన్నాడు. నాగమణి ఫిర్యాదు మేరకు అల్లాదుర్గ్ పోలీస్లు కేసు నమోదు చేశారు. నాగమణి అదే గ్రామానికి చెందిన దండగుల యాదయ్య అలియాస్ యాదవ్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరి సహజీవనానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించి భర్తను చంపాలని పథకం ప్రకారం చంపేశారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్షాదారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి A1 దండుగుల యాదయ్య, A3 వేముల నాగమణిలకు జీవిత ఖైదు విధించింది. కేసును పూర్తి ఆదారాలను సేకరించి నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని ఎస్పి అభినందించారు.