ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న సి. ఏం. కప్-2023 క్రీడా పోటీలకు మండల, జిల్లా స్థాయిలో పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసినదిగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి క్రీడా పోటీల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల స్థాయిలో కోకో, కబడ్డీ, వాలి బాల్, ఫుట్ బాల్ , అథ్లెటిక్స్ పోటీలను ఈ నెల 15 నుండి 17 వరకు నిర్వహించనున్నామని, ఈ పోటీలలో 15 నుండి 36 సంవత్సరాలలోపు పురుష, మహిళా అభ్యర్థులు పాల్గొనవచ్చని వారు తెలిపారు. క్రీడల నిర్వహణ కోసం మండల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేశామని ఆ కమిటీలు క్రీడా పోటీలు నిర్వహించే అనుకూల ప్రదేశాలు గుర్తించి తగు ఏర్పాట్లు చేసేలా పర్యవేక్షించవలసినదిగా మండల పరిషద్ అభివృద్ధి అధికారులకు సూచించారు. ఈ టోర్నమెంట్ లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని అన్నారు. క్రీడా పోటీల నిర్వహణకు దాతల నుండి, లేదా సి. ఎస్. ఆర్. నుండి నిధులు సేకరిస్తూ పకడ్బందీగా క్రీడలు నిర్వహించేలా పర్యవేక్షణ చేయవలసినదిగా మండల ప్రత్యెకాధికారులకు సూచించారు.
మండల మండల స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులతో పాటు జిల్లా స్థాయిలో ఈ నెల 22 నుండి 24 వరకు 11 అంశాలలో. అథ్లెటిక్స్, ఫుట్ బాల్. , బాస్కెట్ బాల్, బాక్సింగ్, కుస్తీ ప్లోటీలు ఇందిరా గాంధీ స్టేడియం నందు, కబడ్డీ, ఖో ఖో , వాలి బాల్ పోటీలు ప్రభుత్వ జూనియర్ కళాశాల పెనగణంలో, బ్యాట్మింటన్ పోటీలు ఫై. ఎస్. ఆర్. ఇండోర్ స్టేడియం నందు, హ్యాండ్ బాల్ పోటీలు టి. యస్. ఆర్. యస్. పాఠశాల నందు, స్విమింగ్ పోటీలు నిర్వహించనున్నామని అన్నారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు కప్, పాల్గొనే ప్రతి క్రీడాకారునికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందించనున్నామని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిషద్ సీఈఓ వెంకట శైలేష్, జిల్లా యువజన అధికారి నాగరాజ్, జిల్లా విద్యా శాఖాదికారి రాధాకిషన్, మెదక్, రామాయంపేట మునిసిపల్ కమీషనర్లు జానకి రామ్ సాగర్, ఉమాదేవి, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.