ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 07:54 PM

నాగర్ కర్నూల్ మండలంలోని దేశి ఇటిక్యాల పిఎస్సిఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం జిల్లా అదనప కలెక్టర్ సభావత్ మోతిలాల్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడవద్దని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టాలని రైతులకు సూచించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఆ దిశగా ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. 


ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఇబ్బంది కలుగుతే అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. తూకం చేసిన ధాన్యం సంచులను వెంటది వెంటనే రైస్‌ మిల్లర్లకు తరలించే విధంగా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. వరి ధాన్యంలో తాల్లు ఎక్కువ రావడానికి గల కారణాలను జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లను అడిగి తెలుసుకున్నారు. అగ్గి తెగులు, కాండం తొలిచుపురుగు, ఇటీవల కురిసిన వర్షాల వల్ల తాల్లు వస్తుందని, ప్రతి క్వింటాలుకు రెండు కిలోల తాలు వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తేమ లేకుండా చూసుకోవాలని కోరారు. అయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, రైతులు, తదితరులు ఉన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com