మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం , చర్లపల్లి తండా శివారు లో విషాదం చోటుచేసుకుంది. శేరిల్లా గ్రామానికి చెందిన గుర్రు నాగులు అనే రైతు మంగళవారం వ్యవసాయ పొలంలో కూరగాయల పంటలు వేయడంతో విద్యుత్ మోటార్ లోకి విద్యుత్ సరఫరా రాకపోవడంతో చర్లపల్లి తాండ శివారులోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు ఆన్ చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రైతు మృతి చెందడం వల్ల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.