ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్తాపూర్ లో కంటి వెలుగు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 09, 2023, 03:42 PM

ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలంలోని ముస్తాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ మమత వివేకానంద కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ ప్రతిక్షణం పేద ప్రజల కోసం ఆలోచిస్తూ, వారికి అవసరమయ్యే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, అందులో ఒకటి కంటి వెలుగు అన్నారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మారుమూల గ్రామాలకు కూడా వైద్య సేవలు అందించాలని కెసిఆర్ లక్ష్యం అన్నారు. తమ గ్రామాలకు డాక్టర్లు పరికరాలు తీసుకుని వచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారని, సర్పంచ్ ఈ సందర్భంగా కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. దీనికి అవసరమయ్యే చిన్నచిన్న అవసరాలు స్థానిక ఎమ్మెల్యే సురేందర్ అందిస్తున్నారని, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 9 మే నుండి మే 11వ తేదీ వరకు కంటి వెలుగు ఉంటుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లక్ష్మణ్ గౌడ్, ఏఎంసి వైస్ చైర్మన్ సిద్ధారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బండి రాజయ్య, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేష్, గ్రామ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు నెల్లూరి గంగారం , మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫతియొద్దిన్, భీమ్ రావు, సీనియర్ నాయకులు నరహరి, రాజారెడ్డి, సాదిక్, వడ్ల రవి, బిట్ల కృష్ణ, డాక్టర్లు అమిత, శ్రీరామ్, బాలాజీ, ఏఎన్ఎం రాజమణి, ఆశలు, స్వరూప రాణి అంగన్వాడీ అంజవ్వ, వి ఆర్ ఏలు సాయికుమార్, సాయిలు, కారోబర్ నరేష్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com