మరికల్ నారాయణపేట రోడ్డులోని స్మశాన వాటిక పక్కన కుంట వద్ద మంగళవారం అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు చెట్లపొదల్లో పడేసి వెళ్లిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే పసికందును సగభాగం కుక్కలు, పందులు పిక్కుతున్నాయి. పసికందును వైద్యులు పోస్ట్మార్టం నిర్వహించగా, పంచాయతీ సిబ్బంది దహన సంస్కారాలు చేశారు. పసికందును ఎవరు పడేసారు అనేది విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయ్యో ఏకన్న తల్లి బిడ్డో అంటూ గ్రామస్థులు విచారం వ్యక్తం చేశారు.