బోడుప్పల్ నగర పాలక సంస్థ యందు గల చెంగిచర్ల లోని ఆర్టీసీ డిపో వద్ద నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ ఉన్నత పాఠశాల పనులను సోమవారం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు మేయర్ సామల బుచ్చిరెడ్డి ప్రారంభించినారు. నాచారం ఇండస్ట్రీయల్ ప్రాంతానికి చెందిన టెక్నీప్ ఎఫ్ఎంసి కంపెనీ వారు 2 కోట్ల నిధులు ఇస్తామని హామీ ఇవ్వగా 1 కోటి రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవిగౌడ్ , బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి , కార్పొరేటర్లు, కో అప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు మరియు డీఈవో, టెక్నిప్ ఎఫ్ఎంసి కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.