భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కరకగూడెంలో ఓ యువతి అదృశ్యంపై బుధవారం కరకగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తనకు ఇష్టంలేని పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో మందిలంలోని ఓ యువతి(19) రెండు నెలల నుంచి కనిపించడం లేదని చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా లాభం లేకపోవడంతో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేస నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .యువతి అదృశ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సింది.