ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐదు మంది కథానాయికలతో చిరు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 23, 2024, 06:34 PM

మెగాస్టార్‌ చిరంజీవి  కథానాయికుడిగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’  చిత్రంలో మూడు నుంచి ఐదు మంది  కథానాయికలకు ఆస్కారం ఉందని మొదటి నుంచి టాక్‌ వినిపిస్తోంది. మెయిన్ హీరోయిన్ గా  త్రిషను ఖరారు చేశారు. ఇటీవల ఆమె సెట్‌లో అడుగుపెట్టింది. స్టాలిన్ తర్వాత చిరు, త్రిష కలయికలో 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రమిది. అలాగే ఈ చిత్రంలో మరో ఇద్దరు కథానాయికలు ఖరారు అయినట్లు సమాచారం. ఇషాచావ్లా, సురభి  ఈ సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే వీరిద్దకూ సెట్‌లో అడుగుపెట్టగా పలు సన్నివేశాలు కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి విదేశాల్లో ఉన్నారు.ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ మొదలవుతుంది. వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం  వహిస్తున్నారు.  ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com