టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన రీసెంట్ మూవీ 'వాల్టెయిర్ వీరయ్య' గ్రాండ్ సక్సెస్తో ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం, చిరంజీవి తన తదుపరి భారీ చిత్రం 'భోళా శంకర్' షూటింగ్ను తిరిగి ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ హల్ చల్ చేస్తోంది. ఇటీవల బ్లాక్ బస్టర్ ధమాకాను అందించిన దర్శకుడు త్రినాధరావు నక్కినతో చిరు తన తదుపరి సినిమాని చేయనున్నట్లు లేటెస్ట్ బజ్. డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. దీనిపై స్పష్టత రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.