తెలుగు, తమిళ, కన్నడ సినీ ఇండస్ట్రీల్లో వరుస హిట్లతో దూసుకుపోయిన రష్మిక మందన్నా తాజాగా బాలీవుడ్లోనూ పాగా వేసింది. పుష్ప సినిమాతో అమాంతంగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. దీంతో బాలీవుడ్లో రణ్బీర్ కపూర్ సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రణ్బీర్ అందరినీ చాలా గౌరవిస్తారని, అయితే తనను మేడమ్ అని పిలుస్తుండడం నచ్చడం లేదని పేర్కొంది.