బాలీవుడ్ లో ప్రముఖ నిర్మాతలలో మరియు దర్శకులలో కరణ్ జోహార్ ఒకరు. కరణ్ జోహార్ మీడియాలో ఫుల్ పాపులర్ అన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మల్టీటాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు మే 25న జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు, టీవీ హోస్ట్ ఒక ఆసక్తికర అప్డేట్ని వెల్లడించారు. 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' ఫిబ్రవరి 10, 2023న విడుదల కానుందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అంతేకాకుండా, అతని 27 సంవత్సరాల కెరీర్ లో అతను మొదటిసారిగా యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.