ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 11:22 AM

విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లిలో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు పొగ మంచు దట్టంగా పడుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అక్కడి ప్రజలు చలికి తట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, వృద్ధులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రహదారులు పొగమంచుతో కప్పేయడంతో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com