ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజ‌య‌వాడ‌లో నేరాల సంఖ్య త‌గ్గింది : సీపీ గౌత‌మ్ స‌వాంగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 03:52 PM

అమరావతి రాజధాని ఏర్పాటు అనంతరం విజయవాడలో నేరప్రవృత్తి తగ్గిందని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ అన్నారు. విజయవాడ కమిషనరేట్ లో 2017 ఏడాది నేర వార్షిక సమీక్ష నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతి రాజధాని ఏర్పాటుతో నగర ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చిందని, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి ఉండాలనేదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. గత ఏడాదితో పోల్చితే నగర కమిషనర్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గిందని, నగరంలో సాంకేతికత వినియోగం పెంపు వల్ల పోలీసుల సామర్థ్యం పెరిగిందని, నేరాలు అదుపు చేయడంలో నగర ప్రజల సహకారం బాగుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com