మాజీ ఎమ్మెల్సీ, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ గిడుగు రుద్ర రాజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అంశాలపై ఆయన రాహుల్ గాంధీతో చర్చించారు.