తిరుమల: ముక్కోటి ఏకాదశి వేడుకలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. అర్థరాత్రి తర్వాత స్వామివారికి ధనుర్మాస పూజలు, అభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠ ద్వారాలు ధనుర్మాస పూజల తర్వాత తెరుచుకున్నాయి. జస్టిస్ ఎన్వీ రమణ. మంత్రులు మహేందర్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మలయప్పస్వామి స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు.