ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో ఘనంగా ముక్కోటి ఏకాదశి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 10:29 AM

తిరుమల: ముక్కోటి ఏకాదశి వేడుకలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. అర్థరాత్రి తర్వాత స్వామివారికి ధనుర్మాస పూజలు, అభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే వీఐపీ దర్శనాలు ప్రారంభమయ్యాయి. వైకుంఠ ద్వారాలు ధనుర్మాస పూజల తర్వాత తెరుచుకున్నాయి. జస్టిస్ ఎన్వీ రమణ. మంత్రులు మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి బయట 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. మలయప్పస్వామి స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com