ముంబై : ముంబైలోని కమలా మిల్స్లో జరిగిన అగ్నిప్రమాదంలో 12 మంది యువతులు, మరో ఇద్దరు యువకులు సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు వారు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని రాష్ర్టపతి, ప్రధాని ప్రార్థించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కమలా మిల్స్ కాంపౌండ్లో ఉన్న ఓ రెస్టారెంట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ నుంచి మరికొన్ని రెస్టారెంట్లకు మంటలు శరవేగంగా వ్యాపించాయి. గురువారం అర్థరాత్రి ఈ అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్ని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బందికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఈ ఘటన పట్ల పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. 1 ఎబోవ్ రెస్టారెంట్ నుంచి మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఆ రెస్టారెంట్పై కేసు నమోదు చేశారు. సుమారు 37 ఎకరాల్లో ఉన్న కమలా మిల్స్ ప్రాంగణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది.