అమరావతి: రాష్ట్రంలో ఫ్యాక్షన్ దాదాపు తగ్గిందని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీలతో హోంమంత్రి చినరాజప్ప సమావేశమయ్యారు. సమావేశంలో డీజీపీ సాంబశివరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ… కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్ పూర్తిగా పోలేదన్నారు. ఫ్యాక్షన్ను రూపుమాపాల్సిన బాధ్యత ఎస్పీలదేనన్నారు. గంజాయి స్మగ్లింగ్ పూర్తిగా నివారించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇటీవల రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు ధ్వంసం చేశామన్నారు. గుంటూరు, విజయవాడలో పాతకక్షలతో జరిగే హత్యలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.