న్యూఢిల్లీ : బొగ్గు బ్లాక్ల కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధుకోడా సహా నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మాజీ కార్యదర్శి హెచ్సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ కార్యదర్శి అశోక్ బసు, మరో ప్రభుత్వ అధికారిని ఈ కేసులో కోర్టు దోషులుగా నిర్ధారించింది. నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు కోర్టు వెల్లడించింది. ఈ నలుగురికి గురువారం శిక్షలను ఖరారు చేయనున్నట్లు స్పెషల్ సీబీఐ జడ్జి భరత్ పరాశర్ పేర్కొన్నారు.