పుణెలో ముంబై – బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. వారందరూ ముంబైకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వారిని యశ్వంత్ మనె (55), శారదా యశ్వంత్ మనె (46), హృషికేశ్ యశ్వంత్ మనె (20), కృష్ణ సూర్వెలుగా గుర్తించారు. మనె కుటుంబీకులు సతారాలోని కళాశాలలో తమ కుమార్తెను దిగబెట్టి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని భారతీ విద్యాపీఠ్ పోలీసులు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో హృషీకేశ్ డ్రైవింగ్ చేస్తున్నారని, వేగంగా వస్తున్న కారు ముందు వెళుతున్న ట్రక్కులోకి దూసుకుపోవడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.