అహ్మదాబాద్ : గుజరాత్ ఎన్నికల సందర్భంగా రోడ్ షో నిర్వహించడానికి అధికారులు అనుమతి నిరాకరించిన కారణంగా ప్రధాని నరేంద్రమోడీ వినూత్న పద్దతిలో తన పర్యటనను రూపొందించుకున్నారు. సముద్ర విమానం (సీ-ప్లేన్)లో వచ్చి సబర్మతి నదిలో ల్యాండ్ అవుతారు. అక్కడినుంచి ధరోయి వెళ్లి అంబాజీ ఆలయంలో పూజలు చేస్తారు. సీ-ప్లేన్ గురించి మోడీ మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆ విమానంలో తాను ప్రయాణించనున్నట్లు చెప్పారు. ఇటువంటి అభివృద్ధిని కాంగ్రెస్ ఊహించడం కూడా కష్టమేనని ఆయన అన్నారు.