ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షం కారణంగా భారత్‌ vs శ్రీలంక టాస్‌ ఆలస్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 16, 2017, 11:28 AM

కోల్‌కతా: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు ఈ రోజు కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌లో ప్రారంభం కావాల్సి ఉంది. ఐతే వర్షం కురుస్తుండటంతో 9గంటలకు వేయాల్సిన టాస్‌ను అంపైర్లు నిలిపివేశారు. మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లందరూ డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. బుధవారం ఉదయం కూడా వర్షం కారణంగా టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు అయిన సంగతి తెలిసిందే. గురు, శుక్రవారం వర్షం పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. భారత గడ్డపై శ్రీలంక ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com