ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరగాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 06:54 PM

స్వలాభం కోసం చంద్రబాబు తిరుమ‌ల లడ్డూ ప్ర‌సాదం కల్తీ అని ప్రకటన చేశార‌ని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిప‌డ్డారు. తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదట నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. .. సుప్రీం కోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్ధాలు బయటకు వస్తాయని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా.. సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారు. వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలనే ఇలా చేశారని పేర్కొన్నారు.  సిట్‌ను హడావుడిగా ఏర్పాటు చేశారు.. ఈ సిట్‌పై తమకు నమ్మకం లేదన్నారు. ఇది వరకే చంద్రబాబు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారితో సిట్ వల్ల నిజాలు బయటకు రావు.. సిబిఐకి ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని కోరారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com