గొర్విమానుపల్లి గ్రామం వెలుపల బైపాస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆర్ఎండీబీ డీఈ సుధాకర్ రెడ్డితో కలిసి సోమవారం పరిశీలించారు. గ్రామంలోని రహదారి పూర్తిగా ఇరుకుగా మారడంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది మారింది. ఉన్నత పాఠశాల సమీపం నుంచి ఊరు వెలుపల వున్న ఎస్సీ ప్రాథమిక పాఠశాల వరకు బైపాస్ రోడ్డు నిర్మాణంపై అధికారులతో చర్చించారు. అవుకు, తాడిపత్రి రహదారిలోని పెట్నీకోట, కొండమీదపల్లె సమీప ప్రాంతాల్లో ప్రమాదకరంగా మారిన కనుమలను తొలగించాలని ఆదేశించారు. ఆర్ఆండ్ బీ ఏఈ మునిస్వామి, వైఎస్సార్సీపీ నేత పులి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.