నెల్లూరు జిల్లా: అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని ఇందుకూరుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న 11 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈబి పోలీసులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని జగదేవి పేట గ్రామంలో ఎస్ఈబి ఎస్సై అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
ఈ సమయంలో మడపర్తి శ్రీను అనే వ్యక్తి అక్రమంగా మద్యం తరలిస్తుండడాన్న గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 11 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు అప్పజెప్పనున్నట్లు ఎస్ఈబి పోలీసులు తెలిపారు