భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతమైతే అదుపులోనే ఉంది. అయితే, ఒకవేళ కరోనా వైరస్ ఫోర్త్ వేవ్ వచ్చినప్పటికీ దాని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే, వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. కరోనా రెండు డోసులను దాదాపు 100 శాతం మంది తీసుకున్నారు. మూడో డోసు కూడా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వేవ్ వచ్చిన వ్యాక్సిన్లతో వచ్చిన ఇమ్యూనిటీ కలిగిన ప్రజలపై ఈ మహమ్మారి ప్రభావం తీవ్రత తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఎయిమ్స్ సీనియర్ ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. SARS-CoV-2 ఒక RNA వైరస్, ఉత్పరివర్తనలు తప్పనిసరిగా సంభవిస్తాయన్నారు. . AIIMSలో పెద్దలు, పిల్లలకు కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాక్సిన్ ట్రయల్స్ ప్రధాన పరిశోధకుడైన రాయ్.. భారతదేశం గత సంవత్సరం చాలా వినాశకరమైన రెండవ తరంగాన్ని అనుభవించిందని, ఇది చాలా దురదృష్టకరమన్నారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ల ద్వారా ప్రజల్లో సహజ సంక్రమణం మెరుగైందని, ఎక్కువ కాలం రక్షణను అందుతోందని, ఇది దేశానికి ప్రధాన బలమని అన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగంగా జరగడం వల్ల తదుపరి వచ్చే కరోనా వేవ్ లు కూడా ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపలేవని డాక్టర్ సంజయ్ అన్నారు.మాస్క్ ఆదేశాన్ని సడలించడం గురించి భారత ప్రభుత్వం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని రాయ్ పేర్కొన్నారు