న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రెండు కిలోలన్నర బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 79.80 లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.