కొత్తపల్లి ఎస్సీ కాలనీలోని ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న గౌండా గోచిమాబాషా 47) ప్రమాదవశాత్తు విద్యుత తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మకూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన మాబాషా గత కొన్నేళ్లుగా గౌండా పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం కొత్తపల్లిలో ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా. ఆ ఇంటి పైన వేలాడుతున్న విద్యుత తీగలు తగిలి అక్కడి కక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వమిస్తున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.