దేశంలో రోజూవారీ కరోనా మరణాలు నిన్నటి పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా మరో 149 మంది ప్రాణాలు కోల్పోయినట్లు. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు కొత్తగా 2వేల 528 మందికి కొవిడ్ సోకింది. మరో 3వేల 997మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 29వేల 181 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు. కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.40 శాతానికి పడిపోయినట్లు వివరించింది. రికవరీ రేటు 98.73 శాతానికి పెరిగినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు 180.97కోట్లకుపైగా కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.