ఇటీవల జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) తిరుగులేని విజయం సాధించింది. అసెంబ్లీలో 117 సీట్లకుగానూ ఆప్ 92 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. రికార్డు స్థాయిలో ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకుని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో పంజాబ్ సీఎంగా భగవత్ సింగ్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ విజయం సాధించడంపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పందించారు. ఆప్కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక ఆయన సేవలను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తలంచారు. ఈ క్రమంలోనే ఆయనకు రాజ్యసభ సీటును ఆప్ ఖరారు చేసింది. ఇక జలంధర్లో స్థాపించనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా టర్బోనేటర్ హర్భజన్కే అప్పగించనున్నారు. కొన్ని రోజుల క్రితం పంజాబ్లోని ఖాళీ అవనున్న ఐదు రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. పంజాబ్ నుంచి ఎన్నికైనా ఐదుగురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగుస్తుంది. ఆ ఐదు స్థానాలనూ ఆప్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఒకటి భారత మాజీ బౌలర్ హర్భజన్కు ఇవ్వనున్నారు. మార్చి 21లోపు ఖాళీ రాజ్యసభ స్థానాలకు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. మిగిలిన వారిపైనా రెండు రోజుల్లో స్పష్టత రానుంది.