ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని కోర్బాలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. శిథిలాలను తొలగించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.