బ్యాంకులో పర్యవేక్షణ లోపాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో పేటీఎం బ్యాంకింగ్ కార్యకలాపాలపై R.B.I. పలు ఆంక్షలు విధించింది. కొత్త ఖాతాలు తెరవరాదని పేటీఎంను ఆదేశించింది. ఓ ఐటీ ఆడిట్ సంస్థను నియమించుకొని......బ్యాంకు కార్యకలాపాలను సమగ్రంగా ఆడిట్ చేయించాలని సూచించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ - సెక్షన్ 35A అధికారం ఉపయోగించి ఈ ఆదేశాలు జారీ చేసినట్లు......R.B.I. తెలిపింది. పేటీఎంపై ఆడిట్ అధికారులు ఇచ్చే సమాచారం ఆధారంగా.... కొత్త ఖాతాలకు అనుమతి ఇస్తామని తెలిపింది. 2016లో ఏర్పాటైన పేటీఎం బ్యాంక్.... 2017 మేలో నోయిడా నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఆర్బీఐ ఆంక్షలను పేటీఎం ఎదుర్కోవడం ఇది 3వ సారి.