ఇటీవల రాయలసీమలో కురిసిన భారీ వర్షాలకు జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ముఖ్యంగా కడప జిల్లాలోని పలు జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి. గండికోట ఎత్తిపోతల పథకంకు భారీగా వరదనీరు వచ్చి చేరడంతో పైడిపాలెం జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ రెడ్డి 4 పంపుల ద్వారా 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.