డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆదోని పట్టణంలోని కౌడాల్పేట కాలనీ వాసులు కోరుతున్నారు. డ్రైనేజీ నీరంతా రోడ్లపైకి ప్రవహించడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. కాలనీలో పలు చోట్ల డ్రైనేజీ నీరు ఇళ్లలోకి వస్తోందన్నారు. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.