ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ వివాహం ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ కు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేసి వివాహా శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన, శ్రీరామ్ తన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అనంతపురం జిల్లా వెంకటాపురంలో పరిటాల శ్రీరామ్ వివాహం జ్ఞానతో జరిగింది.