చెన్నై : తమిళనాడు రాజధాని చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షం వల్ల విమానయానానికి అంతరాయం కలిగింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో 10 విమాన సర్వీసులు ఆలస్యంగా నడవనున్నాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరో రెండు విమానాలను హైదరాబాద్కు మళ్లించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమిళనాడులోని పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తుతుంది. తమిళనాడులో ఈ ఏడాది సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.