వారణాసి: బనారస్ హిందూ యూనివర్సిటీ శనివారం రాత్రి నుంచి ఉద్రిక్తంగా మారింది. క్యాంపస్లో మహిళలపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా ఆందోళన చేపట్టిన స్టూడెంట్స్పై పోలీసులు పదేపదే లాఠీచార్జ్ చేశారు. విద్యార్థినులపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంపై తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ లాఠీచార్జ్లో ఓ విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. రెండు రోజులుగా యూనివర్సిటీలో వేధింపులకు వ్యతిరేకంగా విద్యార్థినులు ధర్నా చేపట్టారు. వైస్ చాన్స్లర్ నేరుగా విద్యార్థినులతో మాట్లాడకపోయినా.. కొందరు ప్రతినిధులను పంపించారు. శనివారం సాయంత్రానికి కొన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలున్న విద్యార్థులు కూడా జత కలవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.