అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలకు పయనమయ్యారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై తెదేపా జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీలను మీడియాకు ప్రకటించిన అనంతరం ఆయన తిరుమలకు బయల్దేరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.