ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ పొలిట్‌బ్యూరోలో నందమూరి హరికృష్ణ కొనసాగింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2017, 05:47 PM

విజయవాడ: నటుడు నందమూరి హరికృష్ణ స్థానం టీడీపీలో పదిలంగా ఉంది. ఆయన ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరోలో కొనసాగుతున్నారు. శనివారం కొత్తగా ఏర్పడిన పొటిట్‌బ్యూరోలో హరికృష్ణను టీడీపీ అధిష్టానం కొనసాగించింది. మరోవైపు హరికృష్ణ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే విమర్శలు ఉన్నాయి. శనివారం ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలను టీడీపీ అధిష్టానం ఎన్నుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర కమిటీలతోపాటుగా జాతీయ, పొటిట్‌బ్యూరో సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే పొలిట్‌బ్యూరోలో రెండు మార్పులు చేశారు. తెలంగాణ నుంచి పొలిట్‌బ్యూరోలోకి రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్కను తీసుకున్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, రమేశ్‌రాథోడ్‌ స్థానంలో రేవూరి, సీతక్కను నియమించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడుగా నందమూరి హరికృష్ణ కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. 17 మందితో టీడీపీ పొలిట్‌బ్యూరో నియమించినట్లు ఆయన చెప్పారు. టీడీపీ జాతీయకమిటీలో ఐదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు అధికార ప్రతినిధులు ఉంటారని, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కొనసాగుతారని చంద్రబాబు స్పష్టం చేశారు.


 


టీడీపీ పొలిట్‌బ్యూరో ఇదే..


టీడీపీ పొలిట్‌బ్యూరో అధ్యక్షుడు చంద్రబాబు


సభ్యులు: అశోకగజపతిరాజు, యనమల, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్‌గౌడ్‌, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి, రావుల, సోమిరెడ్డి, ప్రతిభాభారతి, అయ్యన్నపాత్రుడు, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com