తిరుమల శ్రీవారికి ఓ ఎన్నారై భక్తుడు 30కిలోల బంగారం కానుకగా సమర్పించనున్నారు. ఎం.రామలింగరాజు అనే ప్రవాస భారతీయుడు రూ.11 కోట్లతో శ్రీవారికి సహస్ర నామ కాసులహారం చేయించారు. ఆ హారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ఆలయ అధికారులకు అందజేయనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే అమరావతి నుంచి తిరుమలకు బయల్దేరారు.