ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెడ్‌ కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2017, 05:21 PM

గుంటూరు రూరల్‌ జిల్లా పరిధిలో హెడ్‌కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన వారికి పోస్టింగ్‌ ఇస్తూ రూరల్‌ ఎస్పీ సి.హెచ్‌.వెంకటప్పలనాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. యడ్లపాడులో పని చేస్తున్న షేక్‌ మొహమ్మద్‌ అక్బర్‌ ఆలీని సత్తెనపల్లి పట్టణానికి, నరసరావుపేట రూరల్‌లో ఎం.ఆంథోనిని నరసరావుపేట –2 స్టేషన్‌కు, రూరల్‌ సీసీఎస్‌లో ఉన్న ప్రభాకరరావును సీసీఎస్‌కు, అమరావతిలో ఉన్న కె.మోహన్‌రావును చిలకలూరిపేట టౌన్‌కు, డీఎస్‌బీలో ఉన్న డీవై కోటేశ్వరరావును యడ్లపాడుకు, నిజాంపట్నంలో ఉన్న డి.శ్రీనివాసరావును తెనాలి –2 టౌన్‌కు, యడ్లపాడులో ఉన్న శివయ్యను తెనాలి –2టౌన్‌కు, తెనాలి–1 టౌన్‌లో ఉన్న నాగమల్లేశ్వరరావును తెనాలి –2టౌన్‌కు నియమించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com